శ్రీశైలపూర్నులు అని పిలవబడే తిరుమల నంబి .
ఎంత గొప్ప వారు అంటే, ప్రాచీన కాలం లో స్వామి వారి అభిషేకానికి నీళ్ళు
తెచ్చేవాళ్ళు లేనప్పుడు ఆయన మడి కట్టుకుని బ్రాహ్మీ ముహూర్తం లో, కారు
చీకటి లో స్వామి వారికి పాప నాశనం నుంచి కుండలో నీళ్ళు తెచ్చేవారు. ఒక రోజు
స్వామి వారు ఆయన భక్తిని పరీక్షిద్దామని, అలాగే లోకానికి చాటి చెప్పాలని,
ఒక బోయ వాడి రూపంలో వచ్చి తాత తాత దాహం వేస్తోంది కొన్ని నీళ్ళు ఇవ్వా అని
అడిగారు. ఈ నీళ్ళు స్వామి వారి
అభిషేకానికి పట్టికెళ్ళు తున్నాను, నీకు ఇవ్వను పో అన్నాడు. అప్పుడు ఆ
బోయవాడు తిరుమల నంబి వెనక్కి వెళ్లి, బాణంతో కుండని కొట్టాడు. కుండకి
చిల్లు పడింది, నీళ్ళు అంతా తాగేసాడు. ఆయన ఎంత పనిచేసావు రా శ్రీనివాసుడికి
పట్టికెళ్ళే నీళ్ళని తాగేసావా అని చాల బాధ పడ్డారు. తిరుమల నంది ఆ బోయ
పిల్ల వాడిని నిందించబోతోంటే, తాత తాత ఏమి బాధ పడకు అని, నీకు పాప నాశనం
కంటే గొప్ప నీరుని చూపిస్తాను. ఇక్కడే ఉంది అని ఒక కొండ గుహ లోకి
తీసుకువెళ్ళాడు. అక్కడ బాణ ప్రయోగం చేస్తే ఆకాశ గంగ పుట్టింది. ఇక నుంచి ఈ
నీటితో నాకు అభిషేకం చెయ్యి అని అన్నాడు. తిరుమల నంబి ఆశ్చర్యపోయి వెనక్కి
చూసేసరికి, ఆ పిల్ల వాడు మాయమైపోయాడు. కాబడి, ప్రతి శుక్రవారం నాడు ఆకాశ
గంగ నుంచి తీర్థాన్ని తీసుకెళ్ళి స్వామి వారికి అభిషేకం చేస్తారు. స్వామి
వారిచే తాత తాత అని పిలిపించు కున్నాడు కాబట్టి మొదటి నీరాజనం తిరుమల
నమ్బికే. స్వామి వారిని మాడ వీధులలో ఊరేగింపుకి తీసుకుని వెళ్ళేటపుడు,
స్వామి మొదటి నీరాజనం తిరుమల నంబి దేవాలయం దగ్గరే తీసుకుంటారు. ఈ గుడి
సహస్ర దీపాలంకరణ చేసే రోడ్డులో దక్షిణం వైపు ఉంది
No comments:
Post a Comment